2, మార్చి 2014, ఆదివారం
హైదరాబాద్ : వెంకటేష్ మరో మల్టి స్టారర్ చిత్రం కమిటయ్యాడనే వార్తలు ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు చిత్రంతో మల్టి స్టారర్ చిత్రాలకు మళ్లీ చాలా కాలం తర్వాత ఈ తరంలో శ్రీకారం చుట్టిన వెంకటేష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. ఈ సారి రవితేజతో ఆయన కలిపి చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీరూ పోట్ల దర్శకత్వం వహించే అవకాసం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఓ మైగాడ్ చిత్రం తర్వాత ఈ చిత్రం ప్రారంభించే అవకాసం ఉందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్టయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారికంగా ఏ విధమైన ప్రకటనా ఇంతవరకూ లేదు. ఇక వెంకటేష్, మీనా మరోసారి జోడీ కట్టబోతున్నారని సమాచారం. శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఈ జోడీ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యమ్'కి రీమేక్గా ఈ సినిమా రూపొందుతుంది. మాతృకలోనూ మోహన్లాల్ సరసన నటిచింది మీనానే. అందులో మీనా నటనని చూసిన దర్శక,నిర్మాతలు ఈ సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంచుకోవాలని నిర్ణయించారని సమాచారం. అలాగే నదియా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర అయిన పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి